PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాణాసంచా దుకాణ షాపులపై జిఎస్టి అధికారులు దాడులు

1 min read

ప్రతి దుకాణదారుడు నుంచి జీఎస్టీ వసూలు చేసిన అధికారులు

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు:  మండల కేంద్రమైన చెన్నూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదురుగా ఏర్పాటుచేసిన బాణాసంచా దుకాణ షాపులపై కడపకు చెందిన జీఎస్టీ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. ప్రతి సాపును తనిఖీ చేశారు. బాణాసంచా కొనుగోలుకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. అందులో జీఎస్టీ కి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో జీఎస్టీ ఎందుకు కట్టలేదని షాప్ యజమానులను ప్రశ్నించారు.11 సాపులకు సంబంధించి యజమానుల నుంచి జీఎస్టీ వసూలు చేశారు.చెన్నూరులో ఘనంగా దీపావళి చెన్నూరు మండల వ్యాప్తంగా దీపావళి పండుగ పర్వదినాన్ని ఆది వారం . సోమవారం. రెండు రోజులపాటు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటి ఎదుట దీపాలు వెలిగించి దీపావళి పండుగకు స్వాగతం పలికారు. ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలు పెద్దలు ప్రతి ఇంటి ఎదుట బాణాసంచ పెంచారు.

About Author