PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘భవిష్యత్​కు  గ్యారంటీ’.. రథయాత్రను విజయవంతం చేయండి

1 min read

– టీటీడీ  మాజీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యువ గళం పాదయాత్ర మంగళవారం నాటికి 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా లోకేష్ గారికి సంఘీభావంగా మూడు కిలోమీటర్లు పాదయాత్ర భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ చైతన్య రథయాత్ర మరియు నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్రకు సంఘీభావంగ  【11-07-2023】తేదీన మూడు కిలోమీటర్లు  పాదయాత్ర ఉదయం 10:30 గంటలకు గుట్టపల్లి వద్ద నుండి బయలుదేరును మరియు మార్గ మద్యంలో జగనన్న ఇల్లు సందర్శన కార్యక్రమం. మధ్యాహ్నం మూడు గంటలకు శిబ్యాల వద్ద ఉన్న టిడ్కో గృహాల సందర్శన అనంతరం  చల్లంపల్లె రింగ్ రోడ్డు వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడును. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, మాజీ సర్పంచులు,మాజీ మండల అధ్యక్షులు,మాజీ జెడ్పీటీసీ లు అనుబంధ సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

About Author