PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నంపల్లిలో బాబు ష్యూరిటి.. జాబ్ గ్యారంటీ కార్యక్రమం                             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని రామలిం, చెన్నంపల్లి గ్రామాలలో బాబు ష్యూరిటి-భవిష్యత్తు గ్యారెంటీ మిని మేనిఫెస్టో కార్యక్రమాన్ని టిడిపి నిర్వహించింది. ఈ సందర్భంగా టిడిపి పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ కే.యి. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ,  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను కోరారు..  గ్రామాలలోని ఇంటింటికి తిరుగుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎలా లబ్ధి చేకూరాతుందో వివరించారు. టీడీపీ ఇంచార్జ్ కెఈ.శ్యామ్ కుమార్ గారు .టీడీపీ మినీ మేనిఫెస్టో, భవిష్యత్తు గ్యారెంటీ లో భాగంగా మహాశక్తి పథకం గురించి ప్రచారం నిర్వహించారు. అనంతరం నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి మినీ మ్యానిఫేస్టో ద్వారా కలిగే లబ్దిని వివరిస్తూ వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి మండలం ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్ ,బూత్  ఇన్చార్జిలు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author