PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉర్దూ స్కూల్ ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ సత్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు రెహానా బేగం,షాకిర బేగం,ఫోజియా బేగం,షాజియా రఫత్ లు  జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి రంగారెడ్డి చేతులమీదుగాఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను స్వీకరించారు. స్థానిక జిల్లా పరిషత్ లోని మండల పరిషత్ హాలులో ప్రముఖ దినపత్రిక ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి రంగారెడ్డి,జిల్లా సమగ్ర శిక్షణఅభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్,డీఈఓ కార్యాలయ ఏడి సామ్యూల్ పాల్,ఎంఈఓ లు హాజరై ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఉత్తమ ఉపాధ్యాయులకు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ పుష్పరాజ్, సీనియర్ ఉపాధ్యాయులు అస్లాం అలీ,అబ్దుల్ సుకుర్,ఆసిఫా షాహీన్,తాజుద్దీన్ ఫిజికల్ డైరెక్టర్ విజయకుమార్ తదితర ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరించిన ఉపాధ్యాయుల సేవలను కొనియాడి అభినందించారు.భవిష్యత్తులో వీరు జిల్లా స్థాయి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను స్వీకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author