PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగ విద్యార్థికిల్యాప్ టాప్ అందజేత..

1 min read

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విభిన్న ప్రతిబావంతులు, వయోవృద్ధుల

సంక్షేమశాఖ అధికారిణి పి. రాకాడ మహి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :  దివ్యాంగుడైన మైలే డేవిడ్ జార్జి ప్రైస్ విద్యార్ధికి మంగళవారం ఏలూరు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విభిన్న ప్రతిబావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి రాకాడ మహి ల్యాప్ టాప్ ను అందజేశారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులైన విద్యనభ్యసిస్తున్న విద్యార్దులకు ల్యాప్ టాప్ సౌకర్యం కల్పించిందని ఇందులో బాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం కోటలపర్రు గ్రామానికి చెందిన బిఎస్సీ మూడవ సంవత్సరం చదవుతున్న మైలే డేవిడ్ జార్జి ప్రైస్ కి ల్యాప్ టాప్ అందించడం జరిగిందని ఆమె తెలిపారు.  ఈ సందర్బంగా మైలే డేవిడ్ జార్జి ప్రైస్ మాట్లాడుతూ దివ్యాంగుల విద్యార్ధులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ల్యాప్ టాప్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ల్యాప్ టాప్ కోసం గతంలో ధరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తమకు ల్యాప్ టాప్ మంజూరు చేయించి  తమ విద్యకు మేలు చేకూర్చిందని  తెలియజేస్తూ అతను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

About Author