PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి కూలీలకు.. కిట్ల అందజేత..

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు  వేసవిలో ఎండలు మెండుగా ఉండటం వల్ల ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా వారికి ప్రధమ చికిత్స కిట్లను అందజేయడం జరిగిందని ఎంపీపీ సురేష్ యాదవ్, జెడ్పిటిసి దిలీప్ రెడ్డిలు అన్నారు, స్థానిక ఎంపీడీవో సభ భవనం నందు సోమవారం వారు , ఎంపీడీవో మహబూబ్ బి ఆధ్వర్యంలో చికిత్స కిట్లను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వేసవి కాలంలో ఉపాధి కూలీలను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా వారికి టారాపాలిన్ పట్టలు అదేవిధంగా ప్రధమ చికిత్స కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు, ఉపాధి కూలీలు ఎండల కాలం లో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, అందుకు అనుగుణంగా ముందస్తు సమయం కేటాయించుకుని పనులు చేసుకోవాలని, అలాగే త్రాగునీరు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ బి, ఏపీ డి సోమశేఖర్ ,ఏ పీ ఓ, సుధారాణి సర్పంచ్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author