PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి గడపలో సంతోషం… ప్రతి గడపలో చిరునవ్వు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం సాయంత్రం 46వ వార్డ్ అశోక్ నగర్ పాలకొట్టాలు విధిల్లో 120వ సచివాలయం పరిధిలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,వార్డ్ కార్పొరేటర్ వాసు ,వైస్సార్సీపీ పార్టీ ముఖ్యనాయకులు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి గడపలో సంతోషం అన్ని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక 46వ వార్డుల్లో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ నగర్, పాల కొట్టాల ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశించారు.పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఎన్నో పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. వీటిని సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా అర్హత ఉన్న ప్రతి గడపకు చేర్చామన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక 46వ వార్డ్ కార్పొరేటర్ వాసు ,రైల్వే ప్రసాద్ , ప్రభుదాస్ ,యూసుఫ్ , మళ్ళీ , హసీనా ,ఆంజనేలు , భాస్కర్ రెడ్డి , సురేష్ , దావూద్ ,మౌలాలి, సజ్జద్ ,జహీర్ , రషీద్ గ,సచివాలయం సిబ్బంది, వార్డ్ ముఖ్య నాయకులు, కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author