NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బాబుజగజ్జీవన్ రామ్ జయంతి

1 min read

నివాళులర్పించిన ఏపీ ఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఫ్లై ఓవర్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్  జగ్జీవన్ రాం  జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్, జేఏసీ  అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిద్రాణ వ్యవస్థ లో కి నెట్టి వేయబడిన అణగారిన వర్గాన్ని తట్టి లేపి జన జాగృతి కి శ్రీకారం చుట్టిన రాజకీయ వైతాళికుడు బాబు జగ్జీవన్ రాం అని కొనియాడారు. దళిత బహుజన సంఘాల ఉద్యమాల ఊపిరి అయన అని వారు భారత దేశ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ నాయకులు దావాల నరేంద్ర, పూడి శ్రీనివాస్, ఎండి బేగ్, గంగాధరరావు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

About Author