PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. టిడిపి నేత సాయినాథ్ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సేవా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేయాలని ఆకాంక్షించారు. రాజకీయాలకతీతంగా ప్రజలందరినీ సమానత్వ భావంతో చూడాలన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కృషి చేయాలని కోరారు. అలాగే కమలాపురం నియోజకవర్గం లోని కమలాపురం వీరపనాయునిపల్లి పెండ్లిమర్రి చెన్నూరు చింతకొమ్మదిన్నె వల్లూరు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు రుణమాఫీ చేసి రైతుబిడ్డగా ఆదుకోవాలని కోరారు.

About Author