PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవం

1 min read

జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేపిఆర్ మైత్రి చారి స్ట్రబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రామ్మోహన్.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జాతీయ దినపత్రిక దినోత్సవ సందర్భంగా గురువారం విలేకరుల మిత్రులకు కేటీఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి  విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెన్నులు, నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా నిస్వార్ధంగా తమ కలముతో ప్రజల గళాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ పాత్రికేయులు నిస్వార్ధంగా సేవలందిస్తున్నందుకు కెపిఆర్ ట్రస్టు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో  పాత్రికేయలు రామాంజనేయులు యాదవ్, రాజేష్ గౌడ్ సాలరంగడు, లక్ష్మీనారాయణ, హనుమంతు, మంజు, రాజగోపాల్, శిక్షావలి తదితర విలేకరులు పాల్గొన్నారు.

About Author