NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆధ్యాత్మిక శోభ తో విరాజిల్లుతున్న హరిహర క్షేత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక హరిహర క్షేత్రం లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6 వ రోజు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకం పూజలు అనంతరం సుబ్రహ్మణ్యం షష్ఠి ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్యం స్వామికి మరియు బ్రహ్మచారుల కు విశేష ఆరాధన లు జరిపారు. తరువాత లోక కల్యాణర్థం సుదర్శన హోమం చేసారు. సాయంత్రం భారతి రాఘవ నృత్య కేంద్ర, విజయవాడ కు చెందిన కూచిపూడి నృత్య కళాకారుల నృత్యం అహుతులను ఆకట్టు కొన్నాయి. సాయంత్రం గజ వాహనం పైన శ్రీవారు పురావీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు అని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్ర శేఖర్ శర్మ కార్యదర్శి హెచబీకే రాజశేఖర్ రావు తెలిపారు.

About Author