PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హరిహర మహాదేవ శంభో శంకర…

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శివాలయాల్లో తెల్లవారుజామున నుండి ప్రజలు, భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు శివాలయల్లో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివాలయాలకు వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. మంత్రాలయం లో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రబావలి రాఘవేంద్ర సర్కిల్ వరకు ఊరేగింపు నిర్వహించారు. రాంపురం గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున వెలసిన రామలింగేశ్వర దేవాలయం లో వైకాపా యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

About Author