PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హిళ‌ల‌కు మ‌త్తు మందు ఇచ్చాడు.. ఆస్ప‌త్రి నుంచి వెళ్లిపోయాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ‌లోని భువనగిరి జిల్లా ఆస్పత్రిలో ఓ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వైద్యం చేయకుండా ఆసుపత్రి దాటి వెళ్లిపోయారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆసుపత్రి సిబ్బంది మిన్నకుండి పోయారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ కోసం కొందరు మహిళలు భువనగిరి ఆసుపత్రికి వచ్చారు. ముందుగా అనుకున్న పక్రారం ఆ రోజే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆపరేషన్‌కు ముందు 12 మంది మహిళలకు డాక్టర్‌ మత్తు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. సదరు డాక్టర్ మత్తు ఇచ్చిన తర్వాత ఆపరేషన్‌ చేయనని వెళ్లిపోయాడు. ఇప్పటివరకు ఆస్పత్రి వైద్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి ఎదుట బంధువుల పడిగాపులుకాస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో మహిళల కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

                                             

About Author