PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`భార‌త్ పే`తో అత‌డికి సంబంధం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత్ పే సంస్థ మాజీ ఎండీ, కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ కంపెనీకి రాజీనామా చేశారు. అత‌డితో కంపెనీకి ఎలాంటి సంబంధం లేద‌ని సంస్థ ప్ర‌క‌టించింది. కంపెనీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్టట్లు తమ అంతర్గత విచారణలో తేలిందని భారత్ పే సంస్థ వెల్లడించింది. తన పదవులకు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన మరునాడే కంపెనీ ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం. కంపెనీలో జరిగిన నిధుల దుర్వినియోగంలో అష్నీర్‌తోపాటు అతడి భార్య మాధురి జైన్ గ్రోవర్, ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తమ విచారణలో తేలినట్లు భారత్ పే తెలిపింది. దీంతో బుధవారం నుంచి కంపెనీలో అష్నీర్‌కు ఎలాంటి భాగస్వామ్యం లేదని, ఉద్యోగిగా కూడా కొనసాగించలేమని స్పష్టం చేసింది. గతవారం అష్నీర్ భార్య మాధురి జైన్‌ను కూడా కంపెనీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

                                         

About Author