PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయనే సీఎం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జోస్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో నిన్న జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని అన్నారు.జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని కృష్ణదాస్ పేర్కొన్నారు.

About Author