PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన నందువల్లే రఘు రాముడు కు తగిన గుర్తింపు లభించిందని లిటిల్ ఏంజిల్స్ స్కూల్ కరస్పాండెంట్ ఎం.ఎఫ్ ఇమ్మానియెల్, యూటీఎఫ్ నాయకులు రామకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్ సుల్తాన్ అన్నారు. స్థానిక లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో విలేకరి గోగుల రాము అధ్యక్షతన గురువారం సాయంత్రం సీనియర్ జర్నలిస్ట్ , విశాలాంధ్ర విలేకరి ఎస్.రఘు రాముడు కు ఏపీయూడబ్ల్యుజె జిల్లా కార్యవర్గ సభ్యులు గా ఎన్నికయిన సందర్భంగా విలేకరులు , పలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ పత్రికల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని , విలేకరు లు వ్రాసే వార్తల వల్ల ప్రజా సమస్యలు ఎన్నో పరిష్కరమవుతున్నాయని అన్నారు. 25 ఏళ్ల కు పైగా రఘు రాముడు ప్రత్రికారంగంలో పనిచేసి అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేకరులు చాంద్ బాషా , షబీర్ , నాజీర్ , రాఘవేంద్రరావు , బి.సి.నాయకులు అంకన్న , నాగన్న , నాగేశ్వరరావు , శివుడు , టిడిపి పట్టణ అధ్యక్షుడు ఖలీల్ , ఉపాధ్యాయులు నాగ నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

About Author