PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత‌ను ఎన్టీఆర్ కొడుకేనా అనిపించింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అన్ స్టాపబుల్-2 షురూ అయింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు, బాలకృష్ణ ఈ షోను ఎంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడన్నది ఒట్టి అబద్ధమని స్పష్టం చేశారు. నాడు పార్టీలో గొడవలు చేయించింది, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రోడ్ల పైకి పిలిచింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ చూశాక బాలకృష్ణ అంటేనే రోత పుడుతోందని, అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉందని విమర్శించారు.

                                             

About Author