PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరికీ వైద్యం.. ‘విలేజ్​ క్లీనిక్​’తో సాధ్యం: డిప్యూటీ సీఎం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: శనివారపు పేటలో సోమవారం విలేజ్ క్లినిక్ మరియు సచివాలయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభోత్సవం చేయడం జరిగింది.పేద బడుగు బలహీన మరియు మధ్యతరగతి వర్గాల వారికి అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్ లు ఉన్నత ప్రమాణాలతో.అధునాతనంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు, అత్యవసర వైద్య నికి కిలోమీటర్ల దూరం ప్రయాణించి అవసరంలేదని విలేజి క్లినిక్ లో అందుబాటులో ఉండే డాక్టర్లతో వైద్యం చేయించుకునే వెసులుబాటు ఏర్పడటం సంతోషదాయకం అన్నారు, ఈకార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్,ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్ పర్సన్ బొద్దాని అఖిల సతీష్ చంద్ర, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీ లక్ష్మీ , డిప్యూటీ మేయర్ లు  గుడిదేసి శ్రీనివాస్,నుకపెయ్యి సుదీర్ బాబు, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచెమ్ మై బాబు,కో అప్షన్ సభ్యులు SMR పెదబాబు,MRD బలరాం, మున్నుల జాన్ గుర్నాద్,గౌరవ కార్పొరేటర్లు,గవర్నమెంట్ అధికారులు,వైయస్సార్ సిపి నాయకులు శనివారం పేట  కార్యదర్శి నందేటి ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

About Author