NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల కోసమే ఆరోగ్య సురక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : ప్రజల ఆరోగ్యంకోసమే ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపిపి వీరభద్రుడుపేర్కొన్నారు.బుధవారం చాగలమర్రి పట్టణంలోని ఒకటవ సచివాలయ పరధి లో మండల పరిషత్‌  ప్రాధమిక పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్ర్తీవ్యాధి నిపుణురాలు షబ్నం,ఈఎన్‌టి చంద్రశేఖర్ రెడ్డి,కంటి వైద్య సహాయకురాలు సౌజన్య,స్థానిక వైద్యాధికారులు అంజలి,శివమోహన్‌లు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమం లో  సర్పంచ్‌ తులశమ్మ, ఉప సర్పంచ్‌ సోహేల్‌, తహసీల్దారు  సుభద్రమ్మ, ఎంపీడీవో మహబూబ్ దౌలా,ఈఓఆర్‌డి సుదర్శన్ రావు, వైస్‌ ఎంపిపి రఫి,మండల కన్వీనర్ కుమార్ రెడ్డి,జిల్లా సేవాదల్‌ అధ్యక్షుడు గణేష్‌రెడ్డి, వార్డు సభ్యులు ఖాజాభీ,షబ్బీర్‌,సిహెచ్‌ఓ రమణమ్మ,హెల్త్‌ఎడ్యుకేటర్‌ వెంకటమ్మ,సూపర్‌వైజర్‌లు లింగారెడ్డి,సీతారాముడు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ రషీదబేగం వైద్య,ఆరోగ్య,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author