PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంకన్నగూడెంలో జగనన్న కంటి వెలుగు,ఆరోగ్య సురక్ష..

1 min read

200 మందికి పరీక్షలు, మందులు పంపిణీ..

అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : పెదవేగి పెదవేగి మండలం అంకన్నగూడెం లో శనివారం గ్రామ సర్పంచ్ దుక్కిపాటి మహాలక్షుముడు అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్షా పేజ్ 2 కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో సుమారు 200 మంది కి వైద్యులుఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ  వైద్య శిబిరం లో సాధారణ వ్యాధులతో బాటు  జగనన్న కంటి వెలుగు లో కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితం గా కళ్ళద్దాలు అందజేశారు.ఈ కార్యక్రమం లో పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్.ఎం ఈ ఓ అరుణ్ కుమార్.పెదవేగి మండల వైద్యాధికారులు డాక్టర్ మాధవి.డాక్టర్ ప్రత్యూష.డాక్టర్ బాలకృష్ణ.డాక్టర్ బ్రహ్మం.సి హెచ్ ఓ రోజ్ మేరీ.మండలస్థాయి ఎం ఎల్ హెచ్ పి లు.సచివాలయ వైద్య సిబ్బందిపాల్గొన్నారు.

About Author