NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చేగుంట చెక్​పోస్ట్​ దగ్గర ముమ్మరంగా వాహనాల తనిఖీలు

1 min read

: సిఐ రామ్ లాల్

జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని చేగుంట బార్డర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అని సిఐ రమ్ లాల్  తెలిపారు. ఈ సందర్భంగా సిఐమాట్లాడుతూ…కర్ణాటక నుండి వచ్చే పోయే ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని తెలిపారు. వాహనాల సమాచారం, నెంబర్లు నమోదు చేయాలని సూచించారు. ప్రజలు 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకు వెళ్ళరాదని ఒకవేళ తీసుకువెళ్తే వాటికి సంబంధించిన వివరాలు ఉండాలని సిఐ  తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సిఐ తెలిపారు. వాహనాల తనిఖీల్లో ఎక్సైజ్ పోలీసులు, ఏఎస్ఐ సురేందర్ బాబు, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు మొదలగు వారు ఉన్నారు.

About Author