PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తుంగ‌భ‌ద్ర‌కు భారీ వ‌ర‌ద ప్ర‌వాహం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాటకలో ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 1607.78 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ 31.184 టీఎంసీలుగా కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 38890 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 359 క్యూ సెక్కులుగా నమోదు అయ్యింది.

సుంకేసుల‌కు వ‌ర‌ద ప్ర‌వాహం :
సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్‌ ఫ్లో 13వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేసుల పూర్తి స్థాయి నీటినిల్వ 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.0 టీఎంసీలుగా కొనసాగుతుంది.

                                    

About Author