PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత..

1 min read

– 13 బాక్సులలో తేట్రా పాకెట్లు & కారు సీజ్
పల్లెవెలుగు వెబ్: కర్నూలు శివారులోని పంచలింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద శనివారం ఉదయం సి ఐ మంజుల నేతృత్వంలో ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ మరియు సెబ్ సిబ్బంది చేపట్టిన వాహనాల తనిఖీలో భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్న మహీంద్రా వెరిటో కారు (AP 31 TV 4678)ను తనిఖీలో భాగంగా ఆపేందుకు ప్రయత్నించగా.. కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ చేస్ చేసి సిబ్బంది సహయాంతో పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా 13 బాక్సులో కర్ణాటక మద్యం 96*13=1248 తేట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు . వీటి విలువ సుమారు 36 వేలు ఉంటుందని సెబ్ సి ఐ గారు తెలిపారు. పట్టుబడిన మద్యం మరియు కారును కర్నూల్ సెబ్ పోలీసు స్టేషన్ లో తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. తనిఖీల్లో కాన్స్టేబుల్స్ శాంతరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author