PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీ వ‌ర్షాలు.. ఎక్క‌డెక్క‌డో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అల్పపీడన ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ మంగళవారం వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.లక్షద్వీప్, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ లలో 6,7,9 తేదీల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. కేరళ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

                                         

About Author