PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24 గంటల్లో భారీ వ‌ర్షాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంత ప్రభావంతో మరోమారు..నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయని తెలిపింది. దీంతో నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతుండటంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

                                                 

About Author