PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు జిల్లాలో భారీ వ‌ర్షాలు.. ఉధృతంగా వాగులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూల్ జిల్లాలోని కోడుమూరు మండలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి జిల్లాలో వాగులు, చెరువులు పొంగిపోర్లుతున్నాయి. వర్కూరు వద్ద తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాగు మధ్యలోనే చిక్కుకుంది. బస్సు ఇంజన్‎లోకి నీళ్లు పోవడంతో ట్రావెల్స్ మధ్యలోనే ఆగిపోయింది. స్థానికుల సహాయంతో బస్సును బయటకు తీయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

                                 

About Author