NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు, రేపు సీమ‌లో భారీ వ‌ర్షాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారంనాటికి శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది సోమవారం తమిళనాడు సమీపానికి రానుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభావంతోపాటు సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఆదివారం రాష్ట్రంలో అనేకచోట్ల మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

                                             

About Author