NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలపై రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. మే 29వ తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు దక్షిణ, మధ్య అరేబియా సముద్రం, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మే 31 నుంచి జూన్ 7వతేదీల మధ్య రుతుపవనాలు మొత్తం ఈశాన్య ప్రాంతాలను కవర్ చేశాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి తెలిపారు.

                                        

About Author