NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీ వ‌ర్షాలు.. శ్రీశైలానికి పెరిగిన వ‌ర‌ద

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.  వివిధ జలాశ‌యాలు నిండు కుండ‌లా తొణుకుతున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి  ఇన్ ఫ్లో 1,64,906 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 13,825 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 859 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 102.8910 టీఎంసీలుగా కొనసాగుతోంది.

ReplyForward

About Author