PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హలో మాదాసి కురువ… చలో ఆలూరు…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోళగుంద మండల మదాసి మదారి కురువ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాదాసి&మదారి కురువ సంఘం మండల గౌరవ అధ్యక్షుడు కాలక ప్రసాద్, సలహాదారుడు శేషప్ప,ఎల్లార్తి సర్పంచ్ దర్గప్ప,ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్, మాదాసి కురువ ప్రధాన కార్యదర్శి కురువ మల్లయ్య మండల అధ్యక్షుడు పంపన్న, మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ఆదివారం రోజున ఆలూరులో మదాసి కురువ మదారి కురువ కురువ మహా సింహ గర్జన కార్యక్రమం శశికళ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ స్థాయిలో పాల్గొంటారని మదాసి&మదారి కురువలు భారి ఎత్తున పాల్గొనాలని పార్టీల కతీతంగా ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మదాసి కురువ మదారి కురువ కుల సర్టిఫికెట్ సాధన ధ్యేయంగా ఈ భారీ బహిరంగ సభ ద్వారా మనమందరం ముక్తకంఠంతో పిలుపునిచ్చే విధంగా కలిసికట్టుగా ఒకే నాదంతో పనిచేయాలని అలాగే మనం అన్ని రకాలుగా రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈ భారీ బహిరంగ సభ తోడ్పాటు వస్తుందని కావున జిల్లా నలుమూలల నుంచి సోదరులు సోదరీమణులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సహాయ కార్యదర్శి మొదటమాగి గాది, కోశాధికారి గర్జప్ప,ఎల్లార్తి శేషప్ప,సర్దార్, కమిటీ మెంబర్ సిద్ధప్ప, డాక్టర్ చంద్రశేఖర్, పేటప్ప,పెద్ద సిద్ధప్ప,పెద్ద బీరప్ప, పెడ్డాహ్యట అడివప్ప,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author