PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పెళ్లిసందడి’ టీజర్​ను విడుదల చేసిన హీరో మహేష్​బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​, హైదరాబాద్​: ప్రముఖ తెలుగు చలనచిత్ర విలక్షణ నటుడు శ్రీకాంత్​ తనయుడు రోషన్​ హీరోగా తెరకెక్కుతోన్న ‘పెళ్లిసందడి’మూవీ టీజర్​ను బుధవారం సూపర్​స్టార్​ మహేష్​బాబు విడుదల చేశారు. మహిళా దర్శకురాలు గౌరీరోనంకీ తెరకెక్కిస్తుండడం విశేషం. టీజర్​ విడుదలతో హీరో మహేష్​బాబు చిత్రయూనిట్​కు అల్​ ది బెస్ట్​ తెలిపారు. భారీతారాగణంతో నిర్మిస్తోన్న కుటుంబ కథాచిత్రమిది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చిత్రదర్శకురాలు గౌరీరోనంకి తనదైనశైలిలో నవతర యుగాన్ని ఆకట్టుకునేలా కళాత్మకంగా రూపకల్పన చేశారు. రోషన్​, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రోషన్​కు ఇది రెండవ చిత్రం ప్రేక్షకుల మందుకు రాబోతోంది.

About Author