PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థియేట‌ర్ల మూసివేత పై హీరో నిఖిల్ భావోద్వేగ ట్వీట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సినిమా టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో థియేట‌ర్లు స్వ‌చ్చందంగా మూసివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ హీరో నిఖిల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వివిధ టైర్ కంపార్ట్‌మెంట్ల ఆధారంగా ట్రైన్ టికెట్ రేట్లను ఎలా నిర్ణయిస్తున్నారో అలాగే థియేటర్స్ టికెట్ రేట్లను నిర్ణయించాల్సిదిగా కోరాడు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో 20 రూపాయల టిక్కెట్ సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్‌తో బాల్కనీ/ప్రీమియం విభాగాన్ని అనుమతించమని అధికారులకు నిఖిల్ ట్వీట్ ద్వారా అభ్యర్థనను తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

                                   

About Author