NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్పత్రిలో చేరిన హీరో శింబు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :త‌మిళ హీరో శింబు ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధ‌ప‌డుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఓ చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా తీవ్ర జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ రావ‌డంతో ఆస్పత్రిలో చేరిన‌ట్టు స‌మాచారం. కోవిడ్ కాద‌ని, మామూలు ఇన్ఫెక్షన్ మాత్రమేన‌ని వైద్యులు చెప్పారు. శింబు ఆస్పత్రిలో చేరార‌ని తెలిసిన వెంట‌నే ఆయ‌న అభిమానులు పెద్ద ఎత్తున ఆయ‌న కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

About Author