NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానందీశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్ర సన్నిధిలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఏఈఓ మధు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దుశ్యాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట నంద్యాల జిల్లా మూడవ అదనపు జడ్జి వాసు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ పాల్గొనగా మహానంది ఎస్సై జి నాగేంద్ర ప్రసాద్ తమ సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించారు.

About Author