PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఎస్ఈసీ కు హైకోర్టు నోటీసులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎల‌క్షన్ క‌మీష‌న‌ర్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కాన్ని హైకోర్టులో స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ పిటిష‌న్ పై మంగ‌ళ‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఇత‌ర ప్రతివాదులు కూడ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. తదుప‌రి విచార‌ణ ఈ నెల 29కి వాయిదా వేసింది. నీలం సాహ్ని ఎన్ఈసీగా బాధ్యత‌లు తీసుకున్నాక‌.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. ఆ నోటిఫికేష‌న్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కొత్తగా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని సూచించింది.

About Author