NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

RRR అరెస్టు పై హైకోర్టుకు…

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఏపీ సీఐడీ అధికారులు ధృవీక‌రించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీస్తున్నార‌నే ఆరోప‌ణ‌తో ఆయ‌న‌ను అరెస్టు చేశారు. అయితే ర‌ఘురామ‌కృష్ణరాజు అరెస్టు మీద ఆయ‌న న్యాయ‌వాదులు హైకోర్టుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్రకారం ఎంపీని అరెస్టు చేయ‌లేద‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిష‌న్ మీద ఈరోజు మ‌ధ్యాహ్నం వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. ర‌ఘురామకు అనారోగ్య స‌మ‌స్యలున్నాయ‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు విన్నవించారు. విచార‌ణ పూర్తయ్యే వ‌ర‌కు మెజీస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌ర‌చొద్దని హైకోర్టు సూచించింది. ర‌ఘురామ‌కు అన్నిర‌కాల స‌దుపాయాలు క‌ల్పించాల‌ని సీఐడీకి హైకోర్టు నిర్దేశించింది.

About Author