NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేటు స్కూల్ల లో…అధిక ఫీజులను అరికట్టాలి…

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు:  ఈరోజు డి ఈ ఓ ఎస్ సామ్యూల్ పాల్ ని కోడుమూరు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అనంతరత్నమ్ మాదిగ ఐ ఎన్ యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎం ఖాద్రి పాషా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎడ్లూరి లాజరస్ కాంగ్రెస్ నాయకులు జె నాగరాజు జె కుమార్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  తల్లికి వందనం స్కీం ద్వారా కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి విద్యార్థి విద్యార్థినీల తల్లుల అకౌంట్లో చదువుకోడానికి నగదును కేటాయించడం జరిగింది. ఇది అదునుగా చూసుకుని ప్రైవేటు స్కూల్ యజమాన్యం వారు అక్రమంగా అధిక ఫీజులు పెంచడం జరిగింది. కొంతమంది విద్యార్థిని తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా అమాంతంగా ఫీజులు పెంచారని అడగగా మీకు ఉచితంగా ప్రభుత్వము నుండి తల్లికి వందనం స్కీం ద్వారా నగదు వస్తుంది కనుక మేము ఫీజులు పెంచామని కొన్ని ప్రైవేటు సంస్థలు చెప్పకనే చెబుతున్నాయి కావున ప్రభుత్వము ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాన్ని పిలిపించి అధిక ఫీజులను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని మాట్లాడారు లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులను ప్రజలను కలుపుకొని  కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు చేయడానికి కూడా వెనకాడమని తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *