PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రయాన్ 3 విజయంపై  హైస్కూల్ విద్యార్థుల సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : చంద్రుని దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన చంద్రయాన్ 3 విజయంపై  మండల కేంద్రంలోని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు చంద్రయాన్ 3 ల్యాండింగ్ పై ప్రత్యక్ష ప్రసారాన్ని  ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు వీక్షించేందుకు పాఠశాలలో విస్తృత ఏర్పాటు చేశారు. చందమామపై భారతకు చెందిన చంద్రయాన్ 3 అడుగుపెట్టిన వెంటనే విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. జయహో భారత్ అంటూ బిగ్గరగా  నినాదాలు చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరిన మొదటి దేశం మనదైనందుకు గర్విస్తూ, ఇందుకు కృషి చేసిన శాస్త్రవేస్తలందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author