PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అతివేగం..ప్రమాదకరం: డీఎస్పీ

1 min read

పల్లెవెలుగు: కర్నూలు నగర ప్రజలు ట్రాఫిక్​ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు ట్రాఫిక్​ డీఎస్పీ నాగభూషణం. శుక్రవారం  డీఎస్పీ ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.  నగరంలోని కొత్త బస్టాండ్​, కలెక్టరేట్​, సీ క్యాంప్​, రాజ్ విహార్​, మౌర్య ఇన్​ సర్కిల్, కొత్త బస్టాండ్​, పాత బస్టాండ్​​ తదితర కూడళ్లలో ట్రాఫిక్​ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని, ఇందుకు నగర ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. బైక్​పై ప్రయాణించే వారు లైసెన్స్​  తమ వద్ద పెట్టుకోవాలన్నారు. అదేవిధంగా హెల్మెట్​ ధరించాలని, అతివేగంగా బైక్​ నడపరాదని  సూచించారు. అతివేగం ప్రమాదకరమని,  అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ట్రాఫిక్​ రూల్స్​ పాటించాలన్నారు. ఎండలు మండిపోతున్న తరుణంలో.. అవసరమైతే తప్పా రోడ్లపై రావద్దని,  ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఈ సందర్భంగా ట్రాఫిక్​ డీఎస్పీ నాగభూషణం హితువు పలికారు.

About Author