PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాంధీని అసురుడిగా చిత్రీక‌రించిన హిందూ మ‌హాస‌భ‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: భారత జాతిపిత మహాత్మాగాంధీని హిందూ మహాసభ అవమానించిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని దుర్గామాత మండపంలో జరిగింది. కోల్‌కతాలోని హిందూ మహాసభ యొక్క పండల్‌లో మహాత్మా గాంధీని మహిషాసురుడిగా చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. అసుర అనే రాక్షసుడిని మహాత్మా గాంధీగా చిత్రీకరించిన అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు ఇబ్బందుల్లో పడ్డారు.అఖిల భారతీయ హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజా పండల్‌లో మహాత్మా గాంధీని పోలిన అసురుడిని చిత్రీకరించారు.దీనిపై వివాదం చెలరేగడంతో హోం మంత్రిత్వ శాఖ ఒత్తిడి మేర పూజ నిర్వాహకులు గాంధీ చిత్రాన్ని మార్చారు.

                                                 

About Author