PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాకీ.. సెమీస్ లో ఓట‌మి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టోక్యో ఒలంపిక్స్ లో హాకీ పురుషుల జ‌ట్టు ప‌రాజ‌యం చ‌విచూసింది. ప్రపంచ నెంబ‌ర్ 1 బెల్జియం జ‌ట్టుతో జ‌రిగిన పోరులో 5-2 తేడాతో ఓడిపోయింది. ప‌సిడి ప‌త‌కం ఆశ‌లు ఆవిరి కావ‌డంతో.. కాంస్యం కోసం భార‌త్ హాకీ జ‌ట్టు పోరాడ‌నుంది. హాకి ఇండియా స‌రికొత్త చ‌రిత్ర అడుగు దూరంలో చేజారిపోయింది. బెల్జియంతో జ‌రిగిన పోరులో హాకీ ఇండియా త‌న అవ‌కాశాల్ని చేజార్చుకుంది. అయితే భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. టోక్యో ఒలంపిక్స్ లో సెమీస్ కు చేరుకుంది. హారాహోరీగా సాగిన క్వార్టర్ ఫైన‌ల్లో మూడు సార్లు ఒలంపిక్ విజేత ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించింది. ఓలంపిక్స్ లో మ‌హిళ‌ల జ‌ట్టు తొలిసారి సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. దీంతో కొత్త రికార్డు న‌మోదైంది. రెండు జ‌ట్లు నువ్వా నేనా అన్నట్టు క్వార్టర్ ఫైన‌ల్లో ఆడాయి. గ‌ట్టి ప‌ట్టుద‌ల ప్రద‌ర్శించాయి.

About Author