హోళగుంద పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హోళగుంద పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ..కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ అసాంఘిక కార్యకలపాల పై ప్రత్యేక దృష్టి సారించాలి.హోళగుంద పోలీసు స్టేషన్ ను కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి సూచించారు. సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు, సలహాలు చేశారు.పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు , విద్యార్దులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు.వివిధ కేసులలో పట్టు బడిన వాహనాలను డిస్పోజబుల్ చేయాలన్నారు. యు ఐ కేసులు తగ్గించాలన్నారు. రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సిఐ వెంకటచలపతి , హోళగుంద ఎస్సై బాల నరసింహులు సిబ్బంది ఉన్నారు.