PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో సినిమా థియేట‌ర్ల‌కు ఊర‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ప్ర‌భుత్వం సీజ్ చేసిన థియేట‌ర్లను తెరుచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఈ మేరకు మచిలీపట్నంలో ఆయన ప్రకటించారు. సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్‌ యజమానులు ఈరోజు మంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. ఆయా థియేటర్లకు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెలరోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు.

                                          

About Author