PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే పోచం రెడ్డిని సన్మానించిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: చక్కెర ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలలో ముందుండి వారికి మనో ధైర్యాన్ని కల్పించి, వారి కుటుంబాలకు అండదండలుగా నిలబడి కృషి చేసిన కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఆదివారం ఆయన కు శాలువా కప్పి, పుష్పగుచ్చ0 అందజేసి ఘనంగా సన్మానించారు, అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటూ, సంబరాలు చేసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు పి, కృష్ణ ,పెంచల్ రెడ్డి నబి రసూల్ వెంకటరెడ్డి లు మాట్లాడుతూ, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ మూతపడి చాలా సంవత్సరాలు అయినప్పటికీ గత ప్రభుత్వాలు కార్మికుల కష్టాలు పట్టించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు, అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సంకల్ప పాదయాత్రలో తమ కష్టాలను చూసి చెల్లించిపోయారన్నారు, అంతేకాకుండా తమ కష్టాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తీసుకెళ్లడంతో పాటు, మా కుటుంబాలకు అండదండలుగా ఉంటూ మాకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మావెన్నంటే ఉండి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మా శాసన సభ్యులు రవీంద్రనాథ్ రెడ్డికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు, అనంతరం వారు స్థానిక నాయకులు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, కనపర్తి ఎంపీటీసీ పెను మారు రఘురామిరెడ్డి సహాయ సహకారాలతో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని  ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో చెక్కర పార్టీ కార్మికులు పాల్గొన్నారు.

About Author