NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోరా హోరీగా ఎద్దుల బల ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మండలంలో వెలిసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన ను నిర్వహించారు. నాలుగు పండ్ల లోపు విభాగంలో మొదటి బహుమతి భూమా గోవర్ధన్ రెడ్డి, బిల్లాలాపురం 30 వేల రూపాయలు, రెండవ బహుమతి రామ సుబ్బారెడ్డి పోలూరు 20000 రూపాయలు, మూడో బహుమతి దండు నరసింహులు కొణిదెల 15000, నాలుగో బహుమతి పా గుంటన్న గద్వాల పదివేల రూపాయలు, ఐదవ బహుమతి ఆంజనేయులు గద్వాల 8000 రూపాయలు ,ఆరవ బహుమతి మద్దిలేటి బోయినపల్లి 7000 రూపాయలు ,ఏడవ బహుమతి కృతిక మర్రిపల్లి ఆరువేల రూపాయలు, ఎనిమిదవ బహుమతి రామకృష్ణ గద్వాల 5000 రూపాయలు చెందిన వృషభలు గెలుపొందాయి. గెలుపొందిన విజేతలకు ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి, దాతలు శాంతిరాం విద్యాసంస్థల అధినేత మిద్దె శివరాం ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు.

About Author