PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల‌ను బ‌య‌టికి పంపిన హాస్ట‌ల్ సిబ్బంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాయలసీమ యూనివర్సిటీలో పీజీ విద్యార్ధులను హాస్టల్ నుంచి సిబ్బంది బయటకు పంపించివేశారు. మెస్‌చార్జీల బకాయిలు చెల్లించనందుకే విద్యార్థులను బయటకు పంపినట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. అయితే జగనన్న వసతి దీవెన పథకం కింద డబ్బులు రాలేదని విద్యార్థులు తెలిపారు. చేతికి డబ్బులు రాకపోవడంతో ఎలా చెల్లిస్తామని విద్యార్థులు చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదు. మరో రెండు రోజుల్లో బకాయిలు చెల్లించాలని అధికారులు గడువు ఇచ్చారు. వర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

                                          

About Author