PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోటల్​ రంగం..అభివృద్ధి చేస్తా : హనుమంత రావు

1 min read

ఏపీ హోటల్స్ యజమానుల అసోసియేషన్ రాష్ట్ర  ఎగ్జిక్యూటివ్​ సెక్రటరి సముద్రాల హనుమంత రావు

పల్లెవెలుగు, విజయవాడ: రాష్ట్రంలో హోటల్​ రంగం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు ఏపీ హోటల్స్ యజమానుల అసోసియేషన్ రాష్ట్ర  ఎగ్జిక్యూటివ్​ సెక్రటరి సముద్రాల హనుమంత రావు. విజయవాడలో హోటల్​ HYATT PLACE లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ హోటల్స్ యజమానుల అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్​.వి. స్వామి, రాష్ట్ర కార్యదర్శిగా  నాగరాజు శ్రీకాకుళం,  రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా  సముద్రాల హనుమంతరావు కర్నూలు, రాష్ట్ర కోశాధికారిగా పూర్ణచంద్రరావు తెనాలి మరియు ఈసీ మెంబర్లుగా  వైస్ ప్రెసిడెంట్ గా జాయింట్ సెక్రటరీగా రాష్ట్రం మొత్తం మీద 107 మందిని ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ రాయలసీమ జోన్​ నుంచి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్​ సెక్రటరిగా తనకు అవకాశం కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు.  తనకు మద్దతు కర్నూలు,  అనంతపురం,  చిత్తూరు, తిరుపతి, కడప,  హోటల్ యజమానుల అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.   కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది తీరాన కార్పొరేట్​ స్థాయిలో  క్యాటరింగ్​ కాలేజిలు ప్రారంభిస్తామని, హోటల్​ రంగంలో పని చేసేందుకు ఆసక్తి చూపే యువతకు శిక్షణ ఇచ్చి అవకాశం కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు.

About Author