NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలంలో కూడా పథకం కింద ఎంపికైన గ్రామాలలో లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని తహాశీల్దార్ వెంకటశివ ఎంపీడీవో మధుసూదన రెడ్డి హౌసింగ్ డిఇ నాగరాజు సిబ్బందిని ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సిబ్బందితో అధికారులు గురువారం సమావేశం నిర్వహించారు. కూడా పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఏఈ వెంకటరాముడు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రమోద్, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

About Author