PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహా సంకల్పంతో పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలని స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారని అందుకు లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్యాపిలి తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ వారు సందర్శించారు. వారు మాట్లాడుతూ ఉగాది నాటికి జగనన్న కాలనీలోని లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేసి గృహప్రవేశం చేయాలని వారు సూచించారు. అలాగే స్థలము వచ్చి నిర్మాణం ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన వారు త్వరగా చేయాలని‌, లేనిఎడల వారికి ఇచ్చిన పట్టాను రద్దుచేసి మరొకరికి చేస్తామని వారు తెలిపారు. ఇంటి నిర్మాణాల బిల్లులు గాని సమస్యలు ఉంటే హౌసింగ్ ఏఈ వెంకటేష్ కు తెలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివకుమార్ గౌడ్, వీఆర్వో సోమశేఖర్ నాయుడు, బ్రహ్మయ్య మరియు సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author