NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింట ప్రచారంలో బుట్టా ప్రతుల్కి ప్రజలు బ్రహ్మరథం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: నందవరం మండలంలోని మాచాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  తనయుడు బుట్టా ప్రతుల్. గ్రామంలో బుట్టా ప్రతుల్ కి నాయకులు,కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.బుట్టా ప్రతుల్  మాట్లాడుతూ జగనన్న పాలన చూశాం.. సంక్షేమం అంటే అందరికి తెలిసేలా పాలన అందించారు. కావున మన ఫ్యాన్  గుర్తుకు ఓటేసి అమ్మ బుట్టారేణుకమ్మను జగనన్నకు ఇక్కడి నుండి కానుకగా పంపిద్దాం అంటూ  బుట్టా ప్రతుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నందవరం మండల అధ్యక్షులు శివారెడ్డిగౌడు,వైకాపా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు విరుపాక్షిరెడ్డి , నందవరం మండలం JCS  అధ్యక్షులు చాంద్ బాషా, హలహర్వి రామకోటి రెడ్డి,మాచపురం  సర్పంచ్ కోటేశ్వర రావు,పేట శ్రీనివాస్ రెడ్డి , పొనకలదిన్నె సర్పంచ్ నాగరాజు ,వెంకటేష్,గాలన్నా,సత్యన్న,హీజికల్,రాజశేఖర్ రెడ్డి,పెద్ద తిమ్మయ్య,చంద్ర శేఖర్,వరద రాజు,జయరాజు,రాయచోటి గోపాల్, నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

About Author